తమ్ముడిని కాపాడే ప్రయత్నంలో అన్న కూడా..
By - TV5 Telugu |24 Aug 2019 5:39 AM GMT
అనంతపురం జిల్లా శెట్టూరు కరిడిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో పడి ఇద్దరు పిల్లలు చనిపోయారు. వీళ్లిద్దరూ అన్నదమ్ములు. చెరువుగట్ట వద్ద టాయిలెట్కు వెళ్లిన 9 ఏళ్ల బాలు చెరువులో జారిపోయాడు. తమ్ముడ్ని కాపాడే ప్రయత్నంలో 12 ఏళ్ల బన్నీ కూడా చెరువులో జారిపడిపోయాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు చెరువులో గాలించగా ఇద్దరి మృతదేహాలు లభించాయి. ఒకే కుటుంబంలో ఇద్దరు చిన్నారులు మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com