విశాఖలో టీడీపీ నేతల్ని లక్ష్యంగా చేసుకున్న ప్రభుత్వం?

విశాఖలో టీడీపీ నేతల్ని లక్ష్యంగా చేసుకున్న ప్రభుత్వం?

విశాఖపట్నం జిల్లాలో టీడీపీ నేతలను టార్గెట్‌గా చేసుకుని రాజకీయం నడుస్తోందా!? మొన్న మాజీ ఎంపీ మురళీమోహన్, నిన్న మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్‌, నేడు మాజీ మంత్రి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నిర్మాణాలను లక్ష్యంగా అధికారులు కూల్చివేతలకు దిగడం హాట్‌ టాపిక్‌ అయింది. ఇందుకోసం కోర్టు ఆదేశాల్ని సైతం విస్మరిస్తున్నారు. నోటీసు ఇవ్వడానికి... కూల్చివేతలు చేపట్టడానికి.. ఐదు రోజుల గడువు ఇవ్వాలని గతంలో న్యాయస్థానాలు చెప్పాయి. జీవీఎంసీ అధికారులు మాత్రం.. నోటీసిచ్చిన 24 గంటల్లోనే నిర్మాణాల కూల్చివేతలకు దిగుతుండడం స్థానికుల్ని విస్మయానికి గురిచేస్తోంది. ఇది కచ్చితంగా కక్ష సాధింపు చర్యగానే టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు. తాజాగా.. టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గెస్ట్‌హౌస్‌కు అధికారులు నోటీస్‌ జారీ చేశారు. అయితే.. మంగళవారం వరకు యాక్షన్ తీసుకోకుండా కోర్టు స్టే విధించింది.

Tags

Read MoreRead Less
Next Story