రోడ్లను బాగుచేయండి మహాప్రభో!

రోడ్లను బాగుచేయండి మహాప్రభో!

పేరు గొప్ప... ఊరు దిబ్బ అంటే ఇదేనమో! రాజమహెంద్రవరంలో ఎటూ చూసిన గుంతల రోడ్లే!. ఈ నగరంలో ప్రయాణించాలంటే.... నరకం చూడాల్సిందే. ఈ రోడ్డు బాగుచేయండి మహాప్రభో అంటే పట్టించుకునే నాథుడే లేడు. ఆర్‌ ఎండీ బీ అధికారులు దీనిపై చర్యలు తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

రాజమహేంద్రవరం ప్రసిద్ధ శైవక్షేత్రాలకు నిలయం. ఈ నగరానికి దేశవిదేశాలనుంచి పర్యాటకులు వస్తుంటారు. నిత్యం వేలాది వాహనాలు... రాజమహేంద్రవరం మీదుగా వెళ్తుంటాయి. ఇలాంటి చారిత్రక నగరంలో... రోడ్లు మాత్రం అద్వాన్నంగా ఉన్నాయి. ఏ రోడ్డు చూసినా గుంతల మయమే. కొద్దిపాటి వర్షానికే... రోడ్లన్నీ చెరువులుగా మారిపోతాయి. దీనికి తోడు డ్రైనేజీ నీళ్లు కూడా రోడ్లపై రావడంతో... ఆ మార్గంలో వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతారు వాహనదారులు.

ఈ నగరంలోని ప్రధాన రోడ్లన్నింట్లోనూ ఇదే పరిస్థితి. కోటిపల్లి బస్టాండ్‌ నుంచి ప్రధాన రైల్వేస్టేషన్‌కు వెళ్లే రోడ్డు... అత్యంత దారుణంగా ఉంటుంది. గుడ్స్‌ షెడ్‌ సమీపంలోని అండర్‌ గ్రౌండ్‌ బ్రిడ్జి వద్ద నిత్యం వందలాది వాహనాలు నిలిచిపోతాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఇక్కడ రోడ్లపై ఉన్న నీటిని తూతూ మంత్రంగా మోటార్లుతో బయటికి పంపిస్తుంటారు.ఫలితంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అనేక మంది క్షతగాత్రులవుతున్నారు. ఒక్కొసారి.. ప్రాణాలు సైతం కోల్పోతారు.

Tags

Read MoreRead Less
Next Story