వైసీపీ లీడర్ల ఘర్షణ.. ఒకరి పరిస్థితి విషమం..
By - TV5 Telugu |26 Aug 2019 3:21 AM GMT
చిత్తూరు జిల్లా చంద్రగిరి వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. భవానీనగర్లోని గురునాథ్రెడ్డి, నవీన్రెడ్డి మధ్య పాత కక్షలున్నాయి. ఇటీవలి పరిణామాలతో ఈ రెండు వర్గాల మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో.. నవీన్రెడ్డి తిరుపతి నుంచి రౌడీలను తీసుకెళ్లి గుర్నాథరెడ్డి సన్నిహితులపై దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల్ని ప్రస్తుతం రుయా ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com