తేజస్వినిని గుట్టపైకి తీసుకెళ్లి..
By - TV5 Telugu |27 Aug 2019 10:15 AM GMT
పథకం ప్రకారమే తేజస్వినిని నితిన్ హత్యచేశాడని నిర్ధారణ అయింది. తేజస్వి మృతదేహం సమీపంలో రెండు లీటర్ల పెట్రోల్ సీసా దొరకడంతో నితిన్ అంతా వ్యూహం ప్రకారమే చేసి ఉండవచ్చని తెలుస్తోంది. అయితే పెట్రోల్ వాడిన దాఖలాలు మాత్రం లేవు. టీవీ 5 ఎక్స్క్లూజివ్ గా ప్రసారం చేసిన వీడియోలో నితిన్ తేజస్విని గొంతు పిసికి చంపినట్లు చెప్పాడు. బహుశా మృతదేహాన్ని దగ్ధం చేయాలని బావించి వీలుకాక నితిన్ వెళ్లిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. తేజస్విని చంపాలని ముందుగానే నిర్ణయించుకుని యువతిని నిర్జన గుట్ట వద్దకు తీసుకెళ్లి ఉండవచ్చని తెలిపారు పోలీసులు
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com