కొలిక్కిరాని వైఎస్ వివేకా హత్య కేసు
By - TV5 Telugu |30 Aug 2019 4:44 AM GMT
నెలలు గడుస్తున్నా మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు కొలిక్కి రావడం లేదు. కాల్డేటా ఆధారంగా మరోసారి లోతైన దర్యాప్తు చేయాలని సిట్ బృందం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇవాళ పులివెందుల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ప్రాంతాలవారీగా కాల్డేటాను పరిశీలిస్తున్నారు. ప్రతి కాల్ను విశ్లేషించడం ద్వారా.. నిందితులు ఎవరు, హత్యకు సంబంధించి లాంటి ప్లాన్ చేశారు అనే అంశాలు నిర్ధారించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కేసులో నిందితులు పరమేశ్వర్రెడ్డి, శేఖర్రెడ్డికి నార్కో టెస్ట్లు కూడా చేయించారు. ఇప్పుడు కాల్డేటా పరిశీలించి మిస్టరీ ఛేదించేందుకు ట్రై చేస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com