పాకిస్థాన్ ప్రభుత్వానికి విద్యుత్ శాఖ ఊహించని షాక్

కశ్మీర్ విషయంలో అంతర్జాతీయ సమాజం ముందు మనదేశాన్ని ఇరుకున పెట్టడానికి ఇమ్రాన్ ఖాన్ శతవిథాల ప్రయత్నిస్తున్నారు. తాజాగా పాక్ సెక్రటేరియట్ ముందు కశ్మీర్ అవర్ ర్యాలీ నిర్వహించారు. కశ్మీరీలకు తాము అండగా ఉంటామని చెప్పడానికే ఈ ర్యాలీ ఏర్పాటు చేశామని ఇమ్రాన్ చెప్పుకొచ్చారు. ఐతే, ఈ ర్యాలీకి ప్రజల నుంచి స్పందన ఆశించినంతగా రాలేదు. ఐతే, ఇమ్రాన్ మాత్రం రెచ్చిపోయారు. యుద్ధం గురించి మరోసారి ప్రస్తావించారు. అణ్వస్త్రాలు కలిగిన భారత్-పాకిస్థాన్లు యుద్ధభేరి మోగిస్తే దాని పర్యవసానాలు ప్రపంచం మొత్తం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఒకవేళ భారతదేశం, పీఓకేపై సైనిక చర్యకు దిగితే దీటుగా ఎదుర్కొంటామని చెప్పుకొచ్చారు.
పాకిస్థాన్ రైల్వేశాఖ మంత్రి షేక్ రషీద్కు కూడా షాక్ తగిలింది. పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతుంటగా, షేక్ రషీద్కు కరెంట్ షాక్ కొట్టింది. ఆయన చేతిలో ఉన్న మైక్ నుంచి ఒక్కసారిగా కరంట్ ప్రవహించడంతో షేక్ రషీద్ స్వల్పంగా కంపించిపోయారు. సరిగ్గా మోదీ గురించి మాట్లాడుతున్న సమయంలో కరెంట్ షాక్ కొట్టడంతో షేక్ రషీద్ను నెటిజన్లు ఆటాడుకుంటున్నారు.
మరోవైపు, పాకిస్థాన్ ప్రభుత్వానికి అక్కడి విద్యుత్ శాఖ ఊహించని షాక్ ఇచ్చింది. విద్యుత్ బకాయిలు చెల్లించకపోతే కరెంట్ సరఫరా నిలిపివేస్తామని హెచ్చరించింది. ఇప్పటికే లక్షలాది రూపాయలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించాలని కోరింది.
RELATED STORIES
China Corona: చైనా రాజధానిలో మళ్లీ లౌక్డౌన్.. ఇప్పటికే పలు జిలాల్లో...
23 May 2022 4:15 PM GMTUkraine: మరియుపూల్ తర్వాత లుహాన్స్క్ ప్రాంతంపై రష్యా దృష్టి..
23 May 2022 3:45 PM GMTKTR: లండన్లో కేటీఆర్ పర్యటన.. తెలంగాణకు మరో భారీ పెట్టుబడి..
18 May 2022 4:15 PM GMTNorth Korea: ఒక్కరోజే 2 లక్షల 70 వేల కోవిడ్ కేసులు.. కిమ్ రాజ్యంలో...
18 May 2022 9:45 AM GMTCrisis in Sri Lanka: శ్రీలంక ఎయిర్ లైన్స్ ను అమ్మేస్తాం: ప్రధాని
17 May 2022 1:00 PM GMTElisabeth Borne : ఫ్రాన్స్ నూతన ప్రధానిగా ఎలిజబెత్ బోర్న్
17 May 2022 2:30 AM GMT