రైతులపై వైసీపీ నేతల దౌర్జన్యం!

X
By - TV5 Telugu |1 Sept 2019 6:18 PM IST
కృష్ణా జిల్లాలో వైసీపీ నేతలు రైతులపై దౌర్జన్యానికి దిగారు. ఘంటసాల మండలం చిలకలపూడి గ్రామంలో పొలాలను పరిశీలించేందుకు వచ్చిన ఎంపీ బాలశౌరిని ప్రాజెక్టు నిండా నీరున్నా తమ పొలాలకు నీరెందుకు రావడంలేదని రైతులు నిలదీశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ నాయకులు రైతులతో బాహాబాహీకి దిగారు. దీంతో ఇరువురి మధ్య తోపులాట చోటు చేసుకుంది..పరిస్థితి చేయి దాటిపోవడంతో ప్రజాప్రతినిధులు కలగజేసుకున్నారు. వచ్చే ఏడాది నాటికి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి వెను దిరిగారు ఎంపీ బాలశౌరి. సాగునీరు అందక నాట్లు వేసుకోలేకపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com