విశాఖలో వెలుగుచూసిన మరో ఆన్లైన్ దోపిడీ
విశాఖలో ఆన్లైన్ చీటింగ్కు పాల్పడుతున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 7.6 లక్షలతోపాటు బంగారు నాణేలు స్వాధీనం చేసుకున్నారు. బంగారం లింక్ బిజినెస్ చేసేందుకు విశాఖలో 2 రోజుల కిందట ఓ ముఠా మకాం వేసింది. అనుమానం వచ్చిన విశాఖ పోలీసులు దర్యాప్తు చేసి సరైన డాక్యుమెంట్లు లేకపోవడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.
మెండోలిల్ జ్యువెలరీ లిమిటెడ్ కంపెనీ పేరుతో చైన్ లింక్ బిజినెస్ చేసే గుర్గావ్ ముఠా ఓ హోటల్లో మకాం వేసింది. ఆన్లైన్ ద్వారా తమ కంపెనీలో సభ్యులుగా చేరేవారికి నగదుతోపాటు బంగారం ఇస్తామని ఆశ చూపారు. ముందుగా 11 వేల నగదుతోపాటు జీఎస్టీ కింద 3 వందలు కట్టాలన్నది స్కీమ్. ఆ తర్వాత కంపెనీ నుంచి ప్రతినెలా 550 రూపాయలు , ఒక గోల్డ్ కాయిన్ను ఆఫర్ చేశారు. దీంతో చాలా మంది ఆసక్తి చూపారు. హోటల్కు పెద్ద ఎత్తున జనాలు రావడంతో అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రెయిడ్ చేసి అందరినీ అదుపులో తీసుకున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com