వివాహేతర సంబంధం ఎంత పని చేసింది..
By - TV5 Telugu |2 Sep 2019 11:04 AM GMT
హైదరాబాద్లో సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ సతీష్ బాబు హత్య కేసు దర్యాప్తు చివరి దశకు వచ్చింది. మొన్న నగర శివారులో హేమంత్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు... హత్యకు దారి తీసిన పరిస్థితులపై ఆయనను విచారించారు. ఈ హత్య ప్లాన్ ప్రకారం జరిగింది కాదని, ఆవేశంలో స్నేహితుడు సతీశ్ను చంపానని హేమంత్ చెబుతున్నాడు. ఆఫీసులో పనిచేస్తున్న యువతితో వివాహేతర సంబంధం మానుకోవాలని సతీశ్ తనను హెచ్చరించాడని తెలిపాడు. యువతితో సంబంధం విషయం సతీశ్ ఎక్కడ బయటపెడ్తాడేమోనని భావించే, హత్య చేశానని పోలీసులకు చెబుతున్నాడు హేమంత్.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com