కసాయి తండ్రి.. మూడేళ్ల కూతుర్ని, భార్యను ..

కసాయి తండ్రి..  మూడేళ్ల కూతుర్ని, భార్యను ..

కర్నూలు జిల్లా పాములపాడు మండలం పెంచికలపాడులో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో భార్యను, కూతుర్ని బలితీసుకున్నాడు ఓ కసాయి భర్త. కొద్ది రోజుల క్రితం వెంకటేశ్వర్లు, అతని భార్య దేవమ్మకు మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. అప్పటినుంచి వారు తరచుగా గొడవ పడుతున్నారు. ఈ నేపథ్యంలో భార్య దేవమ్మను మూడేళ్ల కూతురు తేజ ప్రియను నిప్పుల వాగులో తోసేశాడు. వాగులో గల్లంతైన తల్లీకూతుళ్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వెంకటేశ్వర్లు చేసిన ఘాతుకంతో దేవమ్మ పుట్టింటి వారు విషాదంలో మునిగిపోయారు. రెండో పెళ్లి చేసుకోవటం కోసం అతను ఈ దారుణానికి తెగబడినట్లు వారు ఆరోపిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story