అమరావతి నుంచి తరలి వెళ్తున్న సంస్థలు . రైతుల్లో ఆందోళన
By - TV5 Telugu |5 Sep 2019 2:39 PM GMT
అమరావతిపై మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై చెలరేగిన దుమారం రాజధాని రైతుల్లో గందరగోళం సృష్టిస్తోంది. సింగపూర్ కన్సల్టెంట్స్, నాగార్జున, షాపూర్జీ పల్లోంజీ కంపెనీ తరలివెళ్లటంపై స్థానిక ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాజధానిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకపోవటంతో ఒక్కో కంపెనీ తరళివెళ్తోంది . రాజధాని వస్తుందని వేల ఎకరాలు ఇచ్చిన తమ భవిష్యత్తు ఏంటని ప్రశ్నిస్తున్నారు రైతులు. అమరావతిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామన్నారు. అవసరమైతే నిరాహారదీక్షలకు కూడా వెనకడుగు వేసేది లేదంటున్నారు రైతులు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com