'జీవితాంతం శుక్రవారం కోర్టుకి వెళ్లాల్సి వస్తుందని భయమా'
వైసీపీ ప్రభుత్వంపై ట్విట్టర్లో మరోసారి విమర్శలు చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. రావాలి సీబీఐ, కావాలి సీబీఐ అన్న జగన్.. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. బాబాయ్ హత్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసిన పెద్ద మనుషులు.. ఇప్పుడు అధికారంలో ఉండి కూడా ఎందుకు వద్దంటున్నారని నిలదీశారు. హత్య కేసులో అనుమానితుల ఆత్మహత్యల వెనుక రహస్యం ఏంటని ప్రశ్నించారు లోకేష్.
కోడికత్తి వెనుక మహాకుట్ర ఉందన్న లోకేష్.. సీబీఐ విచారణ చేపట్టాలని టీవీల్లో అరిచిన గ్యాంగ్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉందని మండిపడ్డారు. జైల్లోనే ప్రాణ హాని ఉందని నిందితుడు అనే పరిస్థితి ఎందుకు వచ్చిందన్నారు. సీబీఐకి కేసు అప్పగిస్తే నిజాలు బయటపడి జీవితాంతం శుక్రవారం కోర్టుకి వెళ్లాల్సి వస్తుందని భయమా అని ఎద్దేవా చేశారు నారా లోకేష్.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com