డోర్ ముందు తాంత్రిక పూజ.. దాన్ని చూసిన..

డోర్ ముందు తాంత్రిక పూజ.. దాన్ని చూసిన..

ఆ ఊళ్లో అంతా భయం..భయం. ఎప్పుడు లేనంతగా జనం వణికిపోతున్నారు. ఉన్నట్టుండి ఊళ్లో తాంత్రిక మంత్రగాళ్లెవరో చొరబడినట్లు జడుసుకుంటున్నారు. అనంతపురం జిల్లా ప్రజలు ఈ భయంతో వణికిపోతున్నారు . ఇంతకీ ఆ మంత్రాల మతలబు ఏమిటి? ఇప్పటివరకు తెలియని ఆ మంత్రాల జోలికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది?

ఓ మనిషిని గడగడ వణికించాలంటే ఎక్కడైనా బలం బలగాలు ఉపయోగించాలేమో. కానీ, మన దేశంలో నిమ్మకాయ, కుంకుమ, రెండు మిరపకాయలు ఉంటే చాలు ఎంతటీవారినైనా మానసికంగా ఖూనీ చేయొచ్చు. మూఢనమ్మకాలకు ఉన్న పవర్ అలాంటిది. క్షుద్రపూజలు, చేతబడులు పేరు చెప్తే పల్లెల్లోనే కాదు పట్టణాల్లోనూ ఇప్పటికీ జనం వణికిపోతారు. అలాంటిది మెయిన్ డోర్ ముందు తాంత్రిక పూజా సామాగ్రి ఉంటే హడలిపోకుండా ఉంటారా? అనంతపురం జిల్లా కదిరి మండలం సోమేష్ నగర్ కాలనీలో అదే జరిగింది.

లక్ష్మీనారాయణ అనే వ్యక్తి హోటల్ ముందు క్షుద్రపూజలు వినియోగించిన పూజా సామాగ్రిని పెట్టి వెళ్లిపోయారు కొందరు దుండగులు. ఉదయాన్నే లేచి హోటల్ దగ్గరికి వెళ్లిన లక్ష్మీనారాయణ కుటుంబం..వాటిని చూసి హడలిపోయారు. హోటల్ ముందు మంత్రించిన వస్తువులు ఉండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో క్షుద్రపూజలు జరుగుతున్నట్లు ఊళ్లో ఒక్కసారిగా ప్రచారం ఊపందుకుంది. లక్ష్మీనారాయణ హోటల్ కు చేరుకున్న స్థానికులు తాంత్రిక పూజల పట్ల భయపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story