సీఎం జగన్ తో ఫోనులో మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

X
By - TV5 Telugu |15 Sept 2019 5:51 PM IST
తూర్పుగోదావరి జిల్లా గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదంపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సీఎం జగన్ తో ఫోనులో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు డీజీపీ గౌతమ్ సవాంగ్ ద్వారా సహాయక చర్యల గురించి ఆరా తీస్తున్నారు. ఇటు బోటు ప్రమాదంలో తెలంగాణ వాసులు కూడా ఉండటంతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఏపీ అధికారులను సంప్రదిస్తున్నారు. కాగా బోటులో మొత్తం 71 మంది ఉన్నట్టు తాజాగా తెలిసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com