కోడెలకు చంద్రబాబు కన్నీటి నివాళి
By - TV5 Telugu |16 Sep 2019 12:24 PM GMT
కోడెల శివప్రసాద్రావు మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బాధాతప్త హృదయాలతో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కోడెల ఆత్మహత్యను జీర్ణించుకోలేకపోతున్నానన్నారు చంద్రబాబు. పల్నాటి పులిలా బతికిన కోడెలను మానసిక, శారీరక క్షోభకు గురయ్యారన్నారు చంద్రబాబు. ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్న కోడెల.. ఈ అవమానాలను భరించలేకపోయారన్నారు. ప్రజస్వామ్యంలో ఇలాంటివి మంచిది కాదన్నారు. దీనిపై పార్టీలో చర్చిస్తామన్నారు చంద్రబాబు. బసవతారక హాస్పిటల్ ఏర్పాటులో కోడెల కీలక పాత్ర పోషించారన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com