మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు లాస్ట్ కాల్ మాట్లాడింది ఆమెతోనే..

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు లాస్ట్ కాల్ మాట్లాడింది ఆమెతోనే..

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు పోస్ట్‌మార్టమ్ నివేదిక పోలీసులకు అందింది. ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు అందించిన ఈ రిపోర్ట్‌లో పలుకీలక అంశాలు వెల్లడయ్యాయి. ఇంట్లోని కేబుల్ వైర్‌తో కోడెల ఉరేసుకున్నట్లు తేలింది. సూసైడ్‌ కోసం కోడెల చాలా ప్లాన్స్ వేసుకున్నట్లు తెలిసింది..మొదట తన పంచెతో ఉరేసుకోవాలని అనుకున్నారు.. కుదరకపోవడంతో వైర్‌తో హ్యాంగయ్యారు.

ఇక పోలీసులు కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు... కోడెల వాడుతున్న మెడిసిన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఆయన 20 రోజుల క్రితమే హైదరాబాద్ వచ్చినట్లు గుర్తించారు. కోడెల ఆత్మహత్యతో ఆయన కుమారుడు శివరాంకు ఎలాంటి సంబంధం లేదని తేల్చారు...ఇక కోడెల కాల్‌డేటాను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆయన క్యాన్సర్ ఆస్పత్రి వైద్యురాలితో లాస్ట్ కాల్ మాట్లాడినట్లు తేల్చారు.

Tags

Read MoreRead Less
Next Story