పడవ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన వారు గల్లంతు
గోదావరి నదిలో గల్లంతైన మృతదేహాల ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ 32 మృతదేహాలను రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించి పోస్ట్మార్టం నిర్వహించారు. ఇంకా 14 మృతదేహాల కోసం గాలిస్తున్నారు. అటు మునిగిన బోటును బయటకు తీసేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి నిపుణులు వచ్చారు. ముందుగా లోతు అధ్యయనం చేస్తున్నారు. పడవ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన వారంతా గల్లంతయ్యారు. రామాంతపూర్ లో ఉండే అంకం కుటుంబం విహారయాత్రకని పాపికొండలు వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లింది. బీటెక్ చదవి.. ఉన్నత చదువుల కోసం వెళ్లాల్సిన అంకం సుశీల్ కూడా ఉన్నారు. అంకం భవానీ టీచర్ గా పనిచేస్తున్నారు. అదే కుటుంబానికి చెందిన వసుంధరా, అంకం పవన్ సహా అంతా గల్లంతయ్యారు. దీంతో బంధువులు, సన్నిహితులు అంతా విషాదంలో మునిగిపోయారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com