హైదరాబాద్-కర్ణాటక పేరు మారింది.. ఇకపై..
హైదరాబాద్-కర్ణాటక పేరు మారింది. ఆ ప్రాంతానికి కళ్యాణ కర్ణాటక అని కొత్త పేరు పెట్టారు. ఈ మేరకు కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కీలక నిర్ణయం ప్రకటించారు. బుధవారం నుంచి హైదరాబాద్-కర్ణాటక రీజియన్ను కళ్యాణ కర్ణాటక రీజియన్గా వ్యవహరించాలని సూచించారు. కళ్యాణ కర్నాటక రీజియన్లో ప్రత్యేక సచివాలయం ఏర్పాటు చేస్తామని చెప్పారు.
కర్నాటకలో 6 రీజియన్లు ఉన్నాయి. బెంగళూరు, ఉత్తర కర్నాటక, కోస్తా కర్ణాటక, పాత మైసూరు, హైదరాబాద్-కర్ణాటక ప్రాంతాలుగా విభజించారు. ఇందులో హైదరాబాద్-కర్ణాటక చాలా కీలకం. ఈ రీజియన్లో బీదర్, గుల్బర్గా, యాద్గిర్, రాయ్చూర్, కొప్పళ్, బళ్లారిలతో కూడిన ఈ ప్రాంతం ఒకప్పుడు నిజాం రాజ్యంలో భాగంగా ఉండేది. స్వాతంత్య్రానంతరం కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పటికీ ఈ ఆరు జిల్లాలను మాత్రం హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంగానే పిలుస్తున్నారు. దశాబ్దాల ఆ పిలుపునకు యడియూరప్ప సర్కారు చరమగీతం పాడింది.
Also watch :
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com