పసికందును చెట్ల పొదల్లో వదిలేసిన గుర్తుతెలియని వ్యక్తులు

పసికందును చెట్ల పొదల్లో వదిలేసిన గుర్తుతెలియని వ్యక్తులు

విశాఖ జిల్లా పాడేరులో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ పసికందును చెట్ల పొదల్లో వదిలేసి వెళ్లారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పసికందును వదిలేసి వెళ్లిన ప్రాంతం డిగ్రీ కాలేజీ విద్యార్థినిల వసతి గృహం దగ్గర్లోనే ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బయటి వ్యక్తులు ఎవ్వరైనా శిశువును తీసుకొచ్చి పడేసారా...? లేదా హాస్టల్‌లోని విద్యార్థినిలకు ఎవ్వరికైనా ఈ ఘటనతో సంబంధం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story