దారుణం : అప్పు తీర్చలేదని అంత్యక్రియలను అడ్డుకున్న బంధువులు

దారుణం : అప్పు తీర్చలేదని అంత్యక్రియలను అడ్డుకున్న బంధువులు

చిత్తూరు జిల్లా పుంగనూరులో దారుణం చోటుచేసుకుంది. అప్పు తీర్చలేదని ఓ వ్యక్తి అంత్యక్రియలను అడ్డుకున్నారు బంధువులు. వెంకటరమణ అనే వ్యక్తి నిన్న అనారోగ్యంతో మృతి చెందాడు. అయితే తన అల్లుడు శివకుమార్ తీసుకున్న 13 లక్షల అప్పుకు ష్యూరిటీగా ఉన్నాడు. దీంతో తన అప్పు చెల్లిస్తేగాని అంత్యక్రియలు జరపనివ్వమని బంధువు శ్రీరామయ్య తేల్చిచెప్పాడు. మృతదేహం వద్దకు కనీసం వెంకటరమణ కుటుంబ సభ్యులను అనుమతించడం లేదు.

Tags

Read MoreRead Less
Next Story