పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర విషాదం

పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, ఓమ్నీ వ్యాన్ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృత్యువాతపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్లో 11 మంది ప్రయాణిస్తున్నారు. ఘటనాస్థలంలోనే ఇద్దరు చనిపోయారు. నల్లజర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు పిల్లలు మరణించారు. తాడేపల్లిగూడెం ఏరియా హాస్పిటల్లో మరో ఇద్దరు చనిపోయారు.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరికి నల్లజర్ల, తాడేపల్లిగూడెంలలో చికిత్స అందిస్తున్నారు. వీరంతా విశాఖ జిల్లా పెందుర్తి మండలం రాంపురంకు చెందినవారిగా ఆధార్ కార్డులతో గుర్తించారు. పెందుర్తి నుంచి తిరుపతి వెళుతుండగా ప్రమాదం జరిగినట్టు సమాచారం. ప్రమాద వార్త తెలియగానే స్థానిక గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకటరావు సహాయక చర్యలను పరిశీలించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com