అర్ధరాత్రి క్షుద్రపూజలు.. ఇంట్లో నుంచి అరుపులు రావడంతో..

X
By - TV5 Telugu |29 Sept 2019 12:05 PM IST
తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. అర్ధరాత్రి ఓ ఇంట్లో నుంచి అరుపులు రావడంతో చుట్టుపక్కల వారికి మెలకువ వచ్చింది. మంత్రాలు చదువుతున్నట్టు అర్థం కావడంతో ఉలిక్కిపడ్డారు. శనివారం రాత్రి ఓ ఇంట్లో పూజలు చేస్తున్నట్టు స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి వచ్చి పరిశీలించిన పోలీసులు.. ఇంట్లోవాళ్ల కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Also watch :
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com