బస్టాండ్ సమీపంలో వ్యక్తి సజీవ దహనం
By - TV5 Telugu |4 Oct 2019 7:12 AM GMT
జనగాం జిల్లా రఘునాథపల్లిలో దారుణం చోటు చేసుకుంది. గోవర్దనగిరి బస్టాండ్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటి హత్య చేసినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ బావి వరకు వెళ్తున్న రైతులు ఈ విషయాన్ని గ్రహించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సజీవదహనం అయిన వ్యక్తికి 36ఏళ్లు ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.
Tags
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com