చెన్నైలో చైనా అధ్యక్షుడికి గ్రాండ్‌ వెల్‌కమ్

చెన్నైలో చైనా అధ్యక్షుడికి గ్రాండ్‌ వెల్‌కమ్

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ చెన్నై చేరుకున్నారు. విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్, ముఖ్యమంత్రి పళనిస్వామి ఘనంగా స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్ట్‌లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలను ఆసక్తిగా తిలకిస్తూ ముందుకు కదిలారు జిన్‌పింగ్‌. మైలాపూర్ ఆలయ పూజారులు వేద మంత్రాలు చదువుతూ.. పూర్ణకుంభాన్ని బహూకరించారు. దీని ప్రాముఖ్యాన్ని అక్కడే ఉన్న చైనా అనువాదకుడు జిన్ పింగ్‌కు వివరించారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా జిన్ పింగ్‌ను ఆహ్వానించారు.

Tags

Read MoreRead Less
Next Story