హీరోయిన్‌ను పెళ్లాడనున్న టీమిండియా క్రికెటర్ మనీశ్‌ పాండే

హీరోయిన్‌ను పెళ్లాడనున్న టీమిండియా క్రికెటర్ మనీశ్‌ పాండే

కర్ణాటక కుర్రోడు, టీమిండియా ఆటగాడు మనీశ్‌ పాండే త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. సినీ నటి అశ్రిత షెట్టితో కలిసి ఏడడుగులు నడవబోతున్నాడు. ఈ ఏడాది డిసెంబర్‌ 2న మనీశ్‌ పాండే, నటి అశ్రిత వివాహ బంధంతో ఒక్కటి కానున్నట్లు తెలుస్తోంది. ఈ వివాహ వేడుక కొద్దిమంది బంధువులు, సన్నిహితుల మధ్య జరగనున్నట్లు సమాచారం.

ముంబైకి చెందిన అశ్రిత (26) 2012లో తుళు భాషలో వచ్చిన ‘తెళికెద బొల్లి’ ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది. అనంతరం ఉదయం ఎన్‌హెచ్‌ 4 ద్వారా తమిళ చిత్రసీమలో అడుగుపెట్టింది. తమిళంలోనే ‘ఒరు కన్నియమ్‌ మూను కలవానికుళుమ్‌’, ‘ఇంద్రజిత్‌’ సినిమాల్లోనూ నటించింది. కాగా, మనీశ్‌ పాండే ప్రస్తుతం విజయ్‌ హజారే ట్రోఫీలో కర్ణాటకకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story