ఈ నెల 19 న రాష్ట్ర బంద్ చేపట్టనున్న ఆర్టీసీ జేఏసీ

X
By - TV5 Telugu |12 Oct 2019 6:39 PM IST
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె రోజురోజుకూ ఉధృతరూపం దాల్చుతోంది. ఇప్పటికే విపక్షాల మద్దతు కూడగట్టుకున్న ఆర్టీసీ జేఏసీ రేపటి నుంచి ఈనెల 19 వరకు రోజుకో విధంగా నిరసన తెలపాలని నిర్ణయించింది. ఈ నెల 19న రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది.
మరోవైపు.. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం కూడా సీరియస్గానే స్పందిస్తోంది. ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించిన కేసీఆర్.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముందుగా అనుకున్న దాని ప్రకారం 50 శాతం బస్సులు తిరిగేందుకు అనువుగా నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. చట్ట విరుద్ధంగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులతో ఎట్టి పరిస్థితుల్లో చర్చలు జరిపేది లేదని తేల్చి చెప్పారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com