దేవాలయం దగ్గర ముగ్గురు దారుణ హత్య
By - TV5 Telugu |12 Oct 2019 9:24 AM GMT
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో దారుణ హత్యలు కలకలం రేపుతున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హత్యకు గురయ్యారు. మల్లన్న దేవాలయం దగ్గర ముగ్గురుని.. గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. మృతులను బిక్కనూర్ మండలం జంగపల్లి గ్రామానికి చెందిన బాలయ్య, లత, చందనలుగా గుర్తించారు. మృతుల్లో బాలయ్య కూతురు, బాలయ్య తమ్ముడి కూతురు ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com