మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన కామాంధుడు
By - TV5 Telugu |14 Oct 2019 4:08 PM GMT
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ కామాంధుడు. తల్లి కూలి పని కోసం వెళ్లినప్పుడు.. ఇంట్లో ఉన్న ఏడేళ్ల బాలికపై.. పక్కింటి యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎవరూ లేరని నిర్ధారించుకుని.. పైశాచికత్వం ప్రదర్శించాడు. బాలిక ఏడుస్తుండడంతో గ్రామస్తులు విషయం అడిగారు. ఆ వెంటనే.. చిన్నారి తల్లికి సమాచారం ఇచ్చారు. కామాంధుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు.
బాధితురాలి తల్లి అశ్వారావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో.. నిందితుడిపై ఫోక్సో చట్టం, ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసులు నమోదు చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com