సర్కార్ కీలక నిర్ణయం.. ఇద్దరు అంతకంటే ఎక్కువమంది పిల్లలుంటే నో జాబ్

సర్కార్ కీలక నిర్ణయం.. ఇద్దరు అంతకంటే ఎక్కువమంది పిల్లలుంటే నో జాబ్

అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు కంటే ఎక్కువమంది సంతానం ఉన్నవారు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులుగా ప్రకటించింది. ఈ నిబంధన 2021 జనవరి నుంచి అమల్లోకి వస్తుంది. దీనికి సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపింది. అసోం జనాభా, మహిళా సాధికారికత విధానం పేరుతో ఈ నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించారు. 2017లోనే ప్రతిపాదనలను అసెంబ్లీ ఆమోదించింది. అటు పేదలకు భూములు పంచాలని కూడా నిర్ణయించారు. ఇప్పటికే ఎన్‌ఆర్‌సి ద్వారా పౌరులను గుర్తించినందున.. అసోంలో భూమి, ఇంటిస్థలం లేనివారికి కేటాయించాలని కేబినెట్ అమోదించింది.

Tags

Read MoreRead Less
Next Story