గుడిసెలో దూరి స్మార్ట్ ఫోన్ దోచుకున్న దొంగలు
By - TV5 Telugu |25 Oct 2019 11:08 AM GMT
హైదరాబాద్ హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కంట్లూరు గ్రామంలో చోరీ జరిగింది. యాగ్నిక వేదపాఠశాలలోని కిషోర్ స్వామి ఇంట్లో దొంగలు పడ్డారు. 7 తులాల బంగారు ఆభరణాలు, 50 వేల నగదు ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత సమీపంలోని తాళాలు వేసిన ఇంటినీ దోచుకున్నారు. ఆ ఇంట్లో 5 తులాల బంగారం, 45 వేల నగదు దోచుకెళ్లారు.
2 ఇళ్లలో వరుస దొంగతనాల తర్వాత.. ఓ గుడిసెలో దూరి స్మార్ట్ ఫోన్ దోచుకున్నారు దొంగలు. దోపిడీ తర్వాత వాళ్లంతా అంబర్పేట్ వైపు వెళ్లినట్టు పోలీసులు తెలిపారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దొంగలు కోసం గాలిస్తున్నామని ఎల్.బి.నగర్ డీసీపీ సన్ప్రీత్ సింగ్ చెప్పారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com