కొరడా దెబ్బలు తిన్న ముఖ్యమంత్రి
రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అని సామెత. మరి రాజే దెబ్బలు తింటే. ఛత్తీస్గఢ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రే కొరడా దెబ్బలు తిన్నారు. అది కూడా అడిగి మరీ కొట్టించుకున్నారు. కొరడాతో కొడుతున్నప్పడు కనీసం గట్టిగా అరవలేదు. పైగా సంతోషంగా కనిపించారు.
గోవర్దనపూజ సందర్భంగా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భాగేల్ ఓ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ అమ్మవారి ఎదుట పూజారి చేతిలో కొరడా దెబ్బలు తింటే మంచి జరుగుతుందని స్థానికుల నమ్మకం. ఈ విషయం తెలుసుకున్న సీఎం, తాను కూడా కొరడాతో కొట్టించుకున్నారు. పూజారి కూడా ముఖ్యమంత్రిని ఓ సామాన్య భక్తుడిగానే భావించి కొరడా ఝుళిపించారు. కొరడాతో కొట్టడానికి ముందు, కొట్టిన తరువాత పూజారి సీఎంకు నమస్కరించారు. అనంతరం ముఖ్యమంత్రి, పూజారిని ఆత్మీయంగా అలింగనం చేసుకుని గుడి నుంచి బయటకు వెళ్లారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com