రాజకీయ ప్రకటనలను నిషేధించిన ట్విట్టర్..

రాజకీయ ప్రకటనలను నిషేధించిన ట్విట్టర్..
X

twitter

అబద్దాలు పలకను.. అనవసరపు వాగ్దానాలు చేయను.. డబ్బులు డబుల్ ఇచ్చినా హోరెత్తే రాజకీయ ప్రకటనలను ట్విట్టర్ పిట్ట పలకనంటోంది. రాజకీయాలు చేయడం వల్ల కాదని ప్రకటనలపై నిషేధం విధిస్తూ ట్విట్టర్ సీఈవో నిర్ణయం తీసుకున్నారు. ఈ నిషేధం నవంబర్ 22 నుంచి అమల్లోకి రానుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను నవంబరు 15న వెల్లడిస్తామని ఆయన అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఫేక్‌న్యూస్, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే ప్రకటనలు, రాజకీయ ప్రకటనలపై పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అన్ని రాజకీయ ప్రకటనలను నిషేధిస్తున్నట్లు తెలిపారు.

రాజకీయ సందేశాలు ప్రజలకు చేరాలి తప్ప కొనకూడదు అని ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాక్ డోర్పే ట్వీట్ చేశారు. ట్విట్టర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని డెమొక్రాట్లు ప్రశంసిస్తుంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారకమిటీ అపహాస్యం చేస్తోంది.

Next Story