అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటాం: ఐసిస్

తమ అధినేత అబు బకర్ అల్ బాగ్దాదీ చనిపోయినట్లు ఐసిస్ నిర్ధారించింది. అమెరికా సైన్యం జరిపిన దాడుల్లో అతడు హతమైనట్లు ఒక ఆడియో విడుదల చేసింది. దీంతో పాటు తమ సంస్థకు తదుపరి అధినేతగా, బాగ్దాదీ వారసుడిగా ఇబ్రహీం అల్ హషమి అల్ ఖురేషిని ప్రకటించింది. బాగ్దాదీ హతమైన కొన్ని గంటల్లోనే.. అతడి అనుచరుడు అబు హసన్ అల్ ముహజిర్ ను కూడా అమెరికా సైన్యం మట్టు బెట్టిందని తెలిపంది. ఈ ఇద్దరి చావుకి కారణమైన యూఎస్ పై ప్రతీకారం తీర్చుకుంటామని ఆ ఆడియోలో తెలిపింది.
ఆదివారం ఎన్డీఎఫ్ దళాల సాయంతో అమెరికా సైన్యం చేసిన సీక్రెట్ ఆపరేషన్ లో బాగ్దాదీ హతమైన విషయం తెలిసిందే. సుమారు 2 గంటలు జరిగిన ఈ ఆపరేషన్ లో బాగ్దాదీతో పాటు తన భార్య, ఇద్దరు పిల్లలు చనిపోయారని అమెరికా ప్రకటించింది. ఈ ఆపరేషన్ వీడియోలు కూడా తాజాగా విడుదల చేసింది. అయితే, ఇప్పుడు ఉగ్రవాద సంస్థ ఐసిస్ కూడా తమ అధినేత చనిపోయినట్లు ప్రకటించింది.
RELATED STORIES
YS Jagan: కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు చర్యలు తీసుకున్నాం- ...
23 May 2022 2:50 PM GMTVangalapudi Anitha: మహిళలను కాపాడలేని సీఎం ఆ పదవిలో ఉన్నా లేకున్నా...
23 May 2022 1:45 PM GMTNara Lokesh: నాపై 14 కేసులు పెట్టారు, అసత్య ఆరోపణలు చేశారు: లోకేష్
23 May 2022 11:30 AM GMTVisakhapatnam Bride Death: పెళ్లి ఆపాలనుకుంది.. ప్రాణమే...
23 May 2022 10:15 AM GMTMLC Ananthababu: సుబ్రమణ్యాన్ని హత్య చేసినట్టు ఒప్పుకున్న ఎమ్మెల్సీ...
23 May 2022 10:00 AM GMTChandrababu: ఏపీ ప్రజలు ఏం పాపం చేశారని పన్నులు తగ్గించట్లేదు:...
23 May 2022 9:16 AM GMT