జపాన్ ప్రధానితో మోదీ భేటీ

జపాన్ ప్రధానితో మోదీ భేటీ

modi

ఏసియాన్ దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు బ్యాంకాక్ వెళ్లిన ప్రధాని నరేంద్రమోదీ పలు దేశాల అధినేతలతో సమావేశమవుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం జపాన్ ప్రధానమంత్రి షింజో అబేతో సమావేశమయ్యారు. అధికారుల స్థాయి ప్రతినిధుల సమావేశం కూడా జరిగింది. ఇరు దేశాల ఉన్నతస్థాయి ప్రతినిధులు సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఇందులో పలు ఒప్పందాలకు ప్రాధమికంగా అంగీకరించారు. అదే సమయంలో ఇద్దరు ప్రధానుల మధ్య ఏసియాన్ దేశాల మధ్య స్వేచ్చా వాణిజ్యానికి సంబంధించిన ఆర్ సెప్ ఒప్పందంపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఆర్ సెప్ ఒప్పందంపై భారత్ ప్రస్తుతానికి సంతకం చేయడానికి నిరాకరించింది. దీనికి గల కారణాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story