కీసర కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు
By - TV5 Telugu |7 Nov 2019 12:58 PM GMT
కీసర కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్, లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు. మాజీ సర్పంచ్ ఈశ్వరయ్య ఆడిట్ రిపోర్టు క్లియర్ చేయడానికి రవికుమార్ రూ. 5 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. డబ్బులిస్తేనే పని పూర్తి చేసానని ఈశ్వరయ్యకు, రవికుమార్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో లక్ష రూపాయలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com