ఆర్డీఓ ఎదుట మహిళా రైతు ఆత్మహత్యాయత్నం

ఆర్డీఓ ఎదుట మహిళా రైతు ఆత్మహత్యాయత్నం

నిజామాబాద్‌ జిల్లా బోదన్‌ RDO కార్యాలయంలో ఓ మహిళా రైతు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. RDO ఎదుటనే పెట్రోల్‌ పోసుకునేందుకు అబ్బవ్వ అనే మహిళ Rప్రయత్నించింది. ఆమెను సిబ్బంది అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. తగ్గెళ్లి గ్రామానికి చెందిన అబ్బవ్వ డిజిటల్‌ పట్టా పాసు బుక్కు కోసం ఏడాదిగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగున్నట్టు తెలిపింది. పాసు బుక్‌ తనకు ఇవ్వకపోగా.. తన భూమిని ఇతరుల పేరుపై మార్చడంతో మనస్థాపానికి గురై.. ఆత్మహత్యకు యత్నించింది.

Tags

Read MoreRead Less
Next Story