అంతిమ విజయం కార్మికులదే: కూనంనేని
By - TV5 Telugu |12 Nov 2019 9:21 AM GMT
TSRTC కార్మికులు చేపడుతున్న సమ్మె 39వ రోజు కొనసాగుతోంది. RTC JAC పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో కార్మికులు నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఇతర జేఏసీ నేతలు కార్మికులకు దండలు వేసి దీక్షలు ప్రారంభించారు. కార్మికుల సమ్మెపై ప్రభుత్వంలో చలనంలేదని కూనంనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతిమంగా కార్మికులే విజయం సాధిస్తారన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారని కూనంలేని ఆరోపించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com