ఆర్టీసీ విలీన నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నాం - అశ్వత్థామ రెడ్డి
By - TV5 Telugu |14 Nov 2019 4:30 PM GMT
ఆర్టీసీ విలీన నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నామని... మిగతా అంశాలపై ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని... జేఏసీ నాయకుడు అశ్వత్థామ రెడ్డి డిమాండ్ చేశారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా... అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు పరామర్శించిన దాఖలాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులను తప్పుదోవ పట్టించేలా కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 15 నుంచి... 19 వ తేదీ వరకు కార్యాచరణను అశ్వత్థామరెడ్డి ప్రకటించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com