మహబూబాబాద్ జిల్లాలో దొంగ నోట్ల చలామణి.. ఇద్దరు మహిళలు..
By - TV5 Telugu |21 Nov 2019 3:55 AM GMT
మహబూబాబాద్ జిల్లాలో దొంగనోట్ల ముఠా పోలీసులకు పట్టుబడింది. కేసముద్రం మండలం ఉప్పరపల్లిలో దొంగ నోట్లను చలామణి చేస్తున్న ఐదుగురుని పోలీసులు పట్టుకున్నారు. వారు ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. దొంగనోట్ల చలామణిపై వీరిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com