ప్రియాంకరెడ్డి హత్యకేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
ప్రియాంకరెడ్డి హత్యకేసు రిమాండ్ రిపోర్టులో సంచలన అంశాలు వెలుగుచూశాయి. ప్రధాన నిందితుడు మహ్మద్ పాషా ప్రియాంక ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. బండి పంక్చర్ వేయిస్తామంటూ తీసుకెళ్లిన శివ ఎంతకూ రాకపోవడంతో పాషాకు కాల్ చేసింది ప్రియాంక. ఈ నెంబర్ ఆధారంగానే పోలీసులు పాషా ఆచూకీని కనిపెట్టారు.
ప్రియాంకపై రాత్రి 9:30 నుంచి 10:20 వరకు అఘాయిత్యానికి ఒడిగట్టారు నిందితులు..నోట్లో మద్యం పోసి..ఆ తర్వాత ఒకరిపై మరొకరు అత్యాచారానికి ఒడిగట్టారు..ముక్కు,నోరు మూయడంతో ప్రియాంక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత ప్యాంట్ లేకుండానే లారీ క్యాబిన్లోకి ఎక్కించారు. లారీలో ప్రియాంక మృతదేహంపైనా అత్యాచారానికి పాల్పడ్డారు కీచకులు..లారీలో కూడా ఒకరి తర్వాత మరొకరు రేప్ చేశారు..ప్రియాంక డెడ్బాడీని కిందకు దించే సమయంలో...బతికే ఉందన్న అనుమానంతో పెట్రోల్ పోసి కాల్చిచంపారు నిందితులు..లారీలో ప్రియాంక రక్తం మరకలు, వెంట్రుకలు, సేకరించింది ఫోరెన్సిక్ బృందం.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com