డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణ హత్యపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
By - TV5 Telugu |1 Dec 2019 12:50 PM GMT
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణ హత్యపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమావేశం సందర్భంగా ప్రియాంక రెడ్డిపై జరిగిన ఘాతుకాన్ని ప్రస్తావించి.. తీవ్ర ఆవేదన చెందారు. మహిళా ఉద్యోగులకు రాత్రి పూట డ్యూటీలు వద్దని చెప్పారు. మానవ మృగాలు మన మధ్యే తిరుగుతున్నాయని కలత చెందారు. ఇది దారుణమైన దుర్ఘటనగా ఆవేదన వ్యక్తం చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com