తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల పెంపు.. ఎంతంటే..
తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల పెంపుకి రంగం సిద్ధమైంది. కొత్తగా పెంచిన ఛార్జీలు సోమవారం అర్థరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. పెరిగిన ఛార్జీలపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పల్లెవెలుగులో కనీస ఛార్జీ 5 నుంచి 10 రూపాయలకు పెంచాలని నిర్ణయించారు. సెమీ ఎక్స్ప్రెస్ కనీస ఛార్జీ 10 రూపాయలుగా నిర్ధారించారు. ఎక్స్ప్రెస్ కనీస ఛార్జీ 10 నుంచి 15 రూపాయలు పెరగనున్నాయి. సూపర్ లగ్జరీలో కనీస ఛార్జీ 25 రూపాయలు కానుంది. రాజధాని, వజ్ర, గరుడ, గరుడ ప్లస్ అన్ని బస్సుల ఛార్జీ కనీసం 35 రూపాయలు పెరగనుంది. వెన్నెల ఏసీ స్లీపర్లో కనీస ఛార్జీ 75 రూపాయలకు పెంచాలని ఆర్టీసీ నిర్ణయించింది..
టికెట్ ఛార్జీలతో పాటు.. అన్ని రకాల బస్పాస్ల ఛార్జీలను కూడా పెంచింది. సిటీ ఆర్డినరీ పాస్ 770 నుంచి 950 రూపాయలు, మెట్రోపాస్ ఛార్జీ 880 నుంచి 1070 రూపాయలకు పెంపు. మెట్రో డీలక్స్ పాస్ 990 రూపాయల నుంచి 1180 రూపాయలకు, స్టూడెంట్ బస్పాస్ 130 నుంచి 165 రూపాయలకు పెంచుతూ ఆర్టీసీ నిర్ణయించుకుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com