తెలుగు తేజం.. మైక్రోసాప్ట్లో ఉద్యోగం.. కోటిన్నర జీతం..
By - TV5 Telugu |4 Dec 2019 10:03 AM GMT
నల్గొండ జిల్లా ధర్మాపురానికి చెందిన చింతరెడ్డి సాయిచరిత్ రెడ్డి బాంబే ఐఐటీలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల జరిగిన క్యాంపస్ సెలక్షన్లో అతడు మైక్రోసాప్ట్ కంపెనీకి మంచి ప్యాకేజీతో ఎంపిక అయ్యాడు. అతడికి ఏడాదికి కోటిన్నర జీతం ఇచ్చేందుకు కంపెనీ ముందుకొచ్చింది. తనతో పాటు మరో ముగ్గురు ఎంపిక కాగా చరిత్ తెలుగు వాడు కావడం మనకు గర్వకారణం.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com