గల్లంతైన చిలీ విమానం
By - TV5 Telugu |10 Dec 2019 12:54 PM GMT
చిలీలో విమానం గల్లంతైంది. అంటార్కిటా నుంచి ప్రయాణిస్తున్న ఈ విమానం సిగ్నల్స్ అందక అదృశ్యమైంది. 21మంది ప్రయాణీకులు, 17మంది సిబ్బందితో కలిసి విమానంలో మొత్తం 38మంది ఉన్నారు. ఈ విషయాన్ని చిలీ దేశాధ్యక్షుడు సెబాస్టియన్ పినెరా ట్విటర్ ద్వారా వెల్లడించారు. విమానం కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. సీ-130 విమానం శాంటియాగో విమానాశ్రయం నుంచి బయలు దేరిన తర్వాత 3 వేల కిలోమీటర్ల దూరం వరకు తమ పర్యవేక్షణలోనే ఉందని, అనంతరం సిగ్నల్స్ అందలేని అధికారులు తెలిపారు. వాతావరణం అనుకూలంగానే ఉందని, ఎందుకు ఇలా జరిగిందో తెలియడంలేదని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. గాలింపు చర్యలు చేపట్టినట్లు వారు వెల్లడించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com