ఏసీబీకి చిక్కిన మరో అవినీతి తిమింగలం

ఏసీబీకి చిక్కిన మరో అవినీతి తిమింగలం

acb

ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం పడింది. ఓ అపార్ట్‌మెంట్‌కు ట్రాన్స్‌ఫార్మర్‌, ప్యానల్‌ బోర్డులను మంజూరు చేసేందుకు 25వేలు డిమాండ్‌ చేశాడో విద్యుత్‌ శాఖ డీఈ. మణికొండకు చెందిన మైలారపు శివకుమార్‌రెడ్డి అనే కాంట్రాక్టర్‌ నుంచి 25వేలు లంచం తీసుకుంటుండగా డీఈ వెంకటరమణ ఏసీబీకి చిక్కాడు. నానల్‌నగర్‌లోని విద్యుత్‌ శాఖ కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. తనిఖీలు నిర్వహించిన అధికారులు కొన్ని ఫైళ్లను సీజ్‌ చేశారు.

అనంతరం ఏసీబీ అధికారులు ఈ అవినీతి అధికారి ఇంటిపై దాడులు నిర్వహించారు. మాదాపూర్‌ మీనాక్షి టవర్‌లోని ప్లాట్‌లో సోదాలు జరిపారు. పెద్ద ఎత్తున బంగారు, వెండి ఆభరణాలు, ఖరీదైన చేతి గడియారాలు, ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు, కట్టల కొద్ది నగదు గుర్తించారు. అర్ధరాత్రి వరకు జరిగిన ఈ సోదాల్లో వెంకటరమణ అవినీతి చిట్టా బయటపడింది. 60 తులాల బంగారు, వెండి ఆభరణాలతో పాటు 26లక్షల లక్షల నగదు, విలువైన ఆస్తి పత్రాలు గుర్తించారు. మొత్తం సొత్తు విలువ మూడున్నర కోట్లు ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేశారు.

Tags

Read MoreRead Less
Next Story