రేణు దేశాయ్ ఈజ్ బ్యాక్..
గత కొద్ది నెలలుగా టాలీవుడ్ నటి రేణు దేశాయ్ తిరిగి నటించడానికి సిద్ధం అయినట్టు ఫిలిం నగరంలో ప్రచారం జరుగుతోంది. రాబోయే టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ లో ఆమె కీలక పాత్ర పోషించడానికి ఎంపికైనట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ కొద్ది రోజుల క్రితం, ఆమె ఈ చిత్రం నుండి తప్పుకున్నట్లు స్పష్టమైంది. రేణు తిరిగి నటించాలనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు పైగా దర్శకత్వంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆమె ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల రైతులు ఎదుర్కొంటున్న వ్యవసాయ సమస్యలపై సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఆమె కొన్ని నెలల క్రితం కర్నూలు జిల్లాను సందర్శించి, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై అక్కడి రైతులతో సంభాషించారు. ఇటీవలి ఇంటర్వ్యూలో, రేణు ఈ చిత్రం షూట్ 2020 జనవరిలో ప్రారంభమవుతుందని ధృవీకరించారు. రేణు 2014 మరాఠీ చిత్రం ఇష్క్ వాలా లవ్ చిత్రానికి దర్శకత్వం వహించారు. దీనికి ముందు, ఆమె 2013 సంవత్సరంలో మంగలాష్టక్ వన్స్ మోర్ అనే మరో మరాఠీ చిత్రాన్ని కూడా నిర్మించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com