ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్

ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్

green-india-challeng

తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన హారిత హారం , గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లు పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రజలను జాగృతం చేస్తున్నాయి. MP జోగినపల్లి సంతోష్ కుమార్ తన జన్మదినం సందర్బంగా మొక్కలు నాటి ఆ తరువాత అందరూ నాటాలని 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' పేరుతో సినీ, రాజకీయ నేతలు స్వీకరించి మరికొందరికి ఛాలెంజ్ విసిరారు. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా "ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్" ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రతి రోజు పండగే టీం తో పాటు మేయర్ బొంతు రామ్మెహనన్ , అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, లతో బంజారాహిల్స్ లోని శ్రీనికేతన్ కాలనీ పార్క్ లో మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించారు. ఈ సందర్బంగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఇందులో పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమం మంచి విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మెహాన్ కూడా మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. హారిత హారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రొగ్రాం లు చాలా బాగా సక్సెస్ అయ్యాయని అన్నారు. ఈ విషయంలో ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు చెప్పారు.

హీరో సాయి ధరమ్ తేజ్ కూడా కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం సాయి ధరమ్ తేజ్ మాట్లాడారు.. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన ఈ ప్రొగ్రాం తనను ఎంతగానో ఆకర్షించిందని అన్నారు. ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్ ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో తనను భాగం చేసినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు. అలాగే హీరోయిన్ రాశీ ఖన్నా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన MP జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారామె.. పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని చెప్పారు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవడం బాధ్యతగా తీసుకోవాలి. అలాగే మరో ముగ్గురుచేత ఈ మొక్కలు నాటే కార్యక్రమం ని చేపట్టేలా చూడలి. అని అన్నారు. కాగా ఈ కార్యక్రమంలో సహా నిర్మాత SKN, ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్స్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ,ఉపాధ్యక్షులు రాంబాబు, శేఖర్, ప్రధాన కార్యదర్శి నాయుడు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు

Tags

Read MoreRead Less
Next Story