మంచిర్యాల జిల్లాలో పులి సంచారం వార్త కలకలం

మంచిర్యాల జిల్లాలో పులి సంచారం వార్త కలకలం

tiger

మంచిర్యాల జిల్లాలో పులి సంచరిస్తందన్న వార్త తీవ్ర కలకలం రేపింది. లక్సెట్టి పేట మండలం లక్ష్మీ పూర్ గ్రామంలోని పంటపొలాల్లో పెద్ద ఆకారంలో పాదముద్రలుకనిపించడంతో రైతులు ఫారెస్టు అధికారులకు సమాచారం అందించారు. లక్సెట్టి పేట రేంజ్ అధికారి,పోలీసులు గ్రామానికి చేరుకొని ఆ పాదముద్రలు పులివేనని నిర్ధారించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పంటపొలాల్లో విద్యుత్ వైర్లు వేయవద్దని, అలా చేస్తే రైతులపై కేసులుపెడుతామన్నారు. పులి సంచారంతో ఈ ప్రాంతంలో తగుచర్యలుచేపట్టినట్లు అధికారులు తెలిపారు. అయితే తమ గ్రామంలో పులి సంచరిస్తుందని తెలియడంతో ఊరి జనం ఆందోళన చెందుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story