అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. పలువురు మృతి
By - TV5 Telugu |21 Dec 2019 9:02 AM GMT
అమెరికాలో మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. నార్త్ కరోలినాలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక విన్ స్టన్ సలీన్ మున్సిపల్ బిల్డింగ్ లో ఈ కాల్పులు చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే కాల్పులకు గల కారణాలు తెలియరాలేదు. మరణించిన వారు ప్రభుత్వ ఉద్యోగులేనని.. గాయపడినవారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సిటీ మేనేజర్ లీ గారిటీ వెల్లడించారు. పరిస్థితి అదుపులోనే ఉందని ఆయన తెలిపారు
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com